12-04-2025 01:55:00 PM
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్(Indravati Tiger Reserve) ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో శనివారం కనీసం ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉమ్మడిగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్కౌంటర్(Encounter) జరిగిందని ఉన్నతాధికారి తెలిపారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమైనప్పటి నుండి అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. “ఎన్కౌంటర్ స్థలం నుండి ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టు కేడర్ల మృతదేహాలను, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు” అని ప్రకటనలో తెలిపారు. మావోయిస్టులను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత వివరణాత్మక నివేదిక జారీ చేయబడుతుందని తెలిపారు. ఇంద్రావతి అభయారణ్యం సమీపంలో మరికొంత మంది మావోయిస్టులు మృతి చెంది ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ కౌంటర్ లో 137 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.