calender_icon.png 23 October, 2024 | 4:52 AM

హైదరాబాద్‌కు వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

29-08-2024 10:05:55 AM

భూత్పూర్: మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.