టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకు ఘటన
పుణె, అక్టోబర్ 2: టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఓ హెలికాప్టర్ కుప్పకూలగా అందులో ఉన్న ముగ్గురు మృతిచెందారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని పుణె లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు పైలెట్లు, ఓ ఇంజినీర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించా రు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ విమాన సంస్థకు చెందిన హెలికాప్టర్ పుణెలోని ఆక్స్ఫర్డ్ గోల్ఫ్క్లబ్ హెలిప్యాడ్ నుంచి ముంబయిలో ని జుహుకు బయలుదేరింది.
టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే అది బవ్దాన్లోని కొండ ప్రాంతాల్లో కూలింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరు కొని సహాయక చర్యలు చేపట్టారు. విపరీతమైన పొగ మంచుతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.