నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబం ఆన్లైన్ బెట్టింగ్ కు బలైంది. కుమారుడు చేసిన అప్పులు తీర్చలేక, తల్లిదండ్రులు, కుమారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగినేని సురేష్(52), హేమలత(50) దంపతులకు కుమారుడు హరీష్ (23) ఉన్నాడు. హరీష్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ భారీగా అప్పులు చేయడంతో సురేష్ కున్న 20 గుంటల భూమి అమ్మి అప్పులు కట్టారు. అయిన మరో 18 లక్షల బాకీ ఉండటం, అప్పుల వాళ్ళ వేధింపులకు గురిచేయడంతో, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సురేష్ దంపతులు, తమ కుమారుడితో కలిసి శనివారం ఉదయం ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో వడ్డేపల్లి గ్రామంలో నెలకొన్నయి. కుమారుడి ఆన్లైన్ బెట్టింగ్ ముగ్గురి కుటుంబ సభ్యుల ప్రాణాలు చేసిందని గ్రామస్తులు, మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.