calender_icon.png 23 October, 2024 | 2:13 AM

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి..

02-09-2024 02:34:40 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడిన విషాదకర ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని రుద్రారం లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. సావిత్రి(28).. తన ఇద్దరు పిల్లలు చిత్ర(3), చిన్మయి (1), జస్వంత్(1)తో కలిసి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో నివసిస్తోంది. సావిత్రి భర్త ఆంజనేయులు ఇస్నాపూర్‌లో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసకావడంతో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు.

ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఏం చేయాలో తోచక.. భర్తి ఇంట్లో లేని సమయంలో శనివారం రాత్రి సావిత్రి తన ము గ్గురు పిల్లలకు అన్నంలో విషం కలిపి ఇచ్చిం ది. తదనంతరం తాను గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థ లాన్ని పరిశీలించారు. మృతదేహాలకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.