గుర్రంతో సహా పలువురికి తీవ్ర గాయాలు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కౌడిపల్లి, జూలై 21 : ఓ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మెదక్ జాతీయ రహదారిపై మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సంఘటన ఆదివారం కౌడిపల్లి మండల శివారులోని బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వెళ్తున్న ఇండికా కారు డ్రైవర్ అతివేగంగా కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న గుర్రా న్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గుర్రం వెనకా ల బైక్పై వెళ్తున్న మల్లేశం అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
మరోవైపు, ఆ కారు డ్రైవ ర్ ఎదురుగా వస్తున్న మారుతి ఆల్టోను సైతం ఢీకొట్టాడు. దీంతో, మారుతి స్విఫ్ట్ కారు ముందు వెళ్తున్న ఆల్టో కారును ఢీకొట్టింది. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న హసీ నా బేగం, అబ్దుల్ ఆసిఫ్, ఇర్ఫాన్, సోయబ్తో పాటు గుర్రం కాళ్ళు, చేతులు విరిగా యి. ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ధ్వంసమైన కార్లను తొలగించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు.