మేడ్చల్ జిల్లా కొల్తూరులో విషాదం
మేడ్చల్, అక్టోబర్ 4: చెరువులో మునిగి ముగ్గురు బాలురు మృతిచెందిన విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్తూ రు గ్రామానికి చెందిన బాలేకర్ సాయి హర్ష (10), సిలేంద్రి హర్షవర్ధన్ (10), ఇరబోయిన మనోజ్ (11) అనే ముగ్గురు బాలురు దసరా సెలవులు కావడంతో ఊర చెరువు వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. వారిలో ఒక బాలుడు చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. మిగతా ఇద్దరు అతడిని కాపాడడానికి ప్రయత్నించి వారు సైతం నీట మునిగారు. బాలుర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీవో న్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.