calender_icon.png 22 October, 2024 | 6:50 PM

ముగ్గురు బెల్టు షాపు నిర్వాహకుల అరెస్ట్

29-07-2024 12:36:30 AM

ఘట్‌కేసర్, జులై 28 : బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి చందుపట్ల గూడకు చెందిన పంజాల సందీప్ (30), ఎదులాబాద్ గ్రామానికి చెం దిన బాలబోయిన శ్రీశైలం (40)లు అధిక ధరకు మద్యం అమ్మకాలు జరుపుతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. జంట నగరాల్లో బోనా ల పండుగ సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులను మూసేసింది. మ ద్యం అమ్మకాలు జరపకూడదని హెచ్చరించింది. దీంతో, వీరిద్దరూ అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తూ అధిక ధరకు మద్యం అమ్మ కాలు జరుపుతున్నారు.

సమాచారం అందుకున్న ఎక్సైజ్  ఇన్‌స్పెక్టర్ ఎస్ సైదులు దాడి జరిపి నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 54 మద్యం బాటిళ్లను స్వాధీ నం చేసుకున్నారు. మరో సంఘటనలో పోచారం ఐటీసీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడ లక్ష్మినర్సింహ్మస్వామి కాలనీలో నానావత్ వినోద (38) ఇంట్లో అక్రమంగా మద్యం అమ్ముతుండటంతో  ఆమెను అరెస్టు చేశారు. ఆమె నుంచి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ రాజువర్మ తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తప్పవన్నారు.