calender_icon.png 8 October, 2024 | 6:01 PM

Breaking News

కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

08-10-2024 03:12:42 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని హోటల్ లో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడిఉన్న ముగ్గురినీ హోటల్ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమాతమైన హోటల్ సిబ్బంది ముగ్గురు కుటుంబసభ్యులను ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మహంకాళి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరు కొత్తగూడెం వాసులుగా గుర్తించారు. కుటుంబకలహాలతోనే ముగ్గురు సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో బాస చేసి, మత్తు మాత్రలు, హానికారక ఇంజెక్షన్లు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహంకాళి పోలీసులు పేర్కొన్నారు.