18-02-2025 12:00:00 AM
యాచారం ఫిబ్రవరి 17 సోమవారం క్యాంపు కార్యాలయంలో. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని మర్యాదపూర్వక కలిసి మాల్ గ్రామపంచాయతీలో అంగడి స్థలం కొరకు సర్వే నెంబర్ 640లో ప్రభుత్వ భూమి నుండి మూడు ఎకరాల స్థలాన్ని అంగడి సంతకు కేటాయించాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం అందించారు.
సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అంగడి సంతకు మూడు ఎకరాల భూమిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ చిన్నోళ్ల జాంగిర్ ,మాజీ వార్డు సభ్యులు పడకంటి శేఖర్ గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు లిక్కి రాజారెడ్డి, మాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.గిరి గాలయ్య, గుడుగుంట్ల రమేష్ , మాస బాలరాజ్, డేరంగుల ఈశ్వర్ పాల్గొన్నారు.