calender_icon.png 26 October, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ అధికారులమంటూ బెదిరింపులు

30-08-2024 12:25:49 AM

ఇద్దరు నిందితుల అరెస్టు 

రాజేంద్రనగర్, ఆగస్టు 29: తాము ఏసీబీ అధికారులమంటూ ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. శివరాంపల్లి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాహుల్ వర్ధన్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. పీఅండ్‌టీ కాలనీకి చెందిన ముజాహిద్, చంద్రాయణ్‌గుట్ట బండ్లగూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీమ్ ఈనెల 26న రాహుల్‌వర్ధన్ షాపు వద్దకు వచ్చారు. తాము ఏసీబీ అధికారులమంటూ బెదిరించారు.

దుకాణంలో చట్టవిరుద్ధమైన వస్తువులు విక్రయిస్తున్నారని తమకు సమా చారం ఉందని దబాయించారు. రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదేరోజు రాహుల్ వర్ధన్ నుం చి రూ.3 వేలు తీసుకున్నారు. మిగతా డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాహుల్‌వర్ధన్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితులిద్దరి నీ అరెస్టు చేశారు. వారి నుంచి రెండు బైకులు, రెండు సెల్‌ఫోన్లు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.