08-02-2025 12:20:04 AM
ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి నిర్ధేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి)-: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు వచ్చేలా కృషిచేయాలని తెలంగాణ కాంగెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క నిర్ధేశం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అందుబాటులోఉన్న ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహిం చారు.
కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.5.50లక్షల కోట్లు రావాల్సి ఉందని, అందులో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు రూ.15వేల కోట్లు ఉన్నాయన్నారు.
ప్రధానంగా కేంద్ర వ్యవసాయ, గ్రామీణా భివృద్ధి, విద్య, ఆరోగ్య, పట్టణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఎంపీలకు ఉపముఖ్యమంత్రి వివరించారు. అదే విధంగా కేం ద్రం నుంచి రావాల్సిన పెండింగ్ పనులు, నిధులకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బుక్లెట్లను ఎంపీలకు అందజేశారు.
సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రామ సహాయం రఘురామిరెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, సురేశ్ శెట్కార్, అనిల్కుమార్ యాదవ్, కడియం కావ్యలతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.