calender_icon.png 14 October, 2024 | 8:12 AM

రూ.5 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

14-10-2024 03:22:44 AM

గుజరాత్ అంకలేశ్వర్‌లో పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

518 కిలోల కొకైన్ సీజ్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గుజరాత్‌లోని అంకలేశ్వర్ పట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ, గుజరాత్ పోలీసులు శనివారం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్ దొరికింది. అంకలేశ్వర్‌లోని అవకార్ డ్రగ్స్ లిమిటెడ్ కంపె నీ ప్రాంగణంలో దాడి చేసి 518 కిలో ల కొకైన్‌ను సీజ్ చేశారు.

ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇటీవల చేపట్టిన రెండు ఆపరేషన్లలో 700 కిలోలకు పైగా కొకైన్ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన విచారణలో గుజరాత్ అవకార్ కంపెనీ పాత్ర గురించి తేలింది. ఈ నేపథ్యంలో తాజా దాడులు చేశారు ఢిల్లీ పోలీసు లు. ఈ డ్రగ్స్ ఫార్మా సొల్యుషన్ సర్వీసెస్ అనే కంపెనీకి చెందినవి తెలు స్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 1,289 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోఫోనిక్ థాయ్ గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ రూ.13,000 కోట్లు.