11-02-2025 05:18:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి సౌందరరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. రామసేన దండు పేరుతో పూజారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ఇటువంటి దాడులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.