హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి లడ్డూ కల్తీకి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వీహెచ్పీ నాయకులు ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, రావినూతల శశిధర్, తనికెళ్ల సత్యరవికుమార్, సునీతా రామ్మోహన్రెడ్డి, డాక్టర్ రామ్సింగ్, పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లడ్డూల తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు పంది, చేప, గొడ్డు నూనెలు వినియోగించడంపై యావత్ హిందూ సమాజం దిగ్భ్రాంతి చెందిందన్నారు.