calender_icon.png 28 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన దినోత్సవానికి ఆ నలుగురు

14-09-2024 12:35:30 AM

హైదరాబాద్,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన  నిర్వహించే  ప్రజాపాలన దినోత్సవానికి హాజరుకావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, గజేంద్రషింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌లను  సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రులకు సీఎం లేఖలు రాశారు.1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.