హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి : 1908లో సంభవించిన మూసీ వరదలను పురస్కరించుకొని ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, సివిల్ సొసైటీ గ్రూపులతో కలిసి శనివారం ఉస్మానియా దవాఖాన ఆవరణలో స్మారక సమావేశాన్ని నిర్వహించారు. 1908 మూసీ వరదల సమయంలో అఫ్జల్పార్కులోని చింతచెట్టుపైకి ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నట్లు వక్తలు వివరించారు. వేదకుమార్, వైద్యులు పాల్గొన్నారు.