calender_icon.png 27 October, 2024 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగస్థలం తర్వాత మంచి సినిమా ఇదే

23-10-2024 12:00:00 AM

యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘ఇటీవల యంగ్ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే’ అన్నారు. హీరో యువచంద్ర మాట్లాడుతూ.. “ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. ఒక్క అవకాశం వస్తే చాలు దేవుడా అనుకున్న సమయంలో వచ్చిన అవకాశం ‘పొట్టేల్’.

ఇలాంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే మా లాంటి వాళ్లం ముందుకు వస్తాం. నేను చిరంజీవికి ఏకలవ్య శిష్యుడిని. గ్యాంగ్ లీడర్ చూసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ వరకు వచ్చింది. ఇక మీ చేతుల్లో ఉంది” అని తెలిపారు. డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ.. ‘చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చెప్తే విన్నాం.

అదిప్పుడు విజువల్‌గా చూడబోతున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్, పెంచల్ దాస్, నోయల్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి, ప్రొడ్యూసర్లు సురేశ్, నిషాంక్, మిగతా చిత్రబృందం అందరూ పాల్గొన్నారు.