రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధిక శరత్ కుమార్, చరణ్ రాజ్, రఘు కుంచె, టీవీ5 మూర్తి కీలక పాత్రలు పోషించారు. రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రాను న్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి యువ కథానాయకుడు విష్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “వెంకట సత్య గారు చాలా ప్యాషన్తో మూవీ చేశారని ట్రైలర్తో తెలుస్తోంది.
ఆయనది సెటిల్డ్ లైఫ్. కానీ వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసం ‘పలాస’ చేశారు. ఆ సినిమాకి మంచి పేరొచ్చింది. ‘ఆప రేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేస్తున్నారు. ఈ సిని మా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. రక్షి త్కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇక్కడ లాస్ట్ ఛాన్స్ అనే ది ఏమీ ఉండదు. ఇంకో ఛాన్స్ ఉంటుందంతే. మనం ఆశ వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి” అన్నారు. “మీ ఆలోచనలు.. వాటి ప్రభావం వల్లే మీరు మంచి వాళ్లా చెడ్డ వాళ్లా అనేది నిర్ణయించడం జరుగు తుంది. మీ ఆలోచనలే మీరు ఎలా ఉండాలో నిర్ణయి స్తాయి. ఆ పాయింట్తో ఈ సినిమాను రూపొందిం చాను” అని దర్శకుడు వెంకట సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంగీర్తన విపిన్, కమెడియన్ రాకెట్ రాఘవ, లిరిసిస్ట్ పూర్ణాచారి, ప్రణవం, ఎగ్జిక్యూటి వ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ చొల్లేటి, రచయత లక్ష్మీ లోహిత్, ఎడిటర్ సత్య తదితరులు పాల్గొన్నారు.