calender_icon.png 28 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 2 కోట్లు విలువైన సెల్ ఫోన్లు స్వాధీనం.. 30 మంది అరెస్ట్

26-05-2024 02:15:59 PM

హైదరాబాద్: సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. చోరీలకు పాల్పడుతున్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 713 ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన సెల్ ఫోన్లను  స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఫోన్లను హైదరాబాద్ లో చోరీ  చేసి ఇతర దేశాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. 30 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.