హైదరాబాద్: సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. చోరీలకు పాల్పడుతున్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 713 ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఫోన్లను హైదరాబాద్ లో చోరీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. 30 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.