వచ్చేవారం బోర్డు సమావేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ఇన్వెస్టర్లకు మరో నజరానా పంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండును ఆమోదించేందుకు వచ్చే సోమవారం బోర్డు సమావేశమవుతుందని వేదాంత బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. గత నెలలోనే షేరుకు రూ. 4 చొప్పున రెండవ మధ్యంతర డివిడెండును వేదాంత ఆమోదించింది.