calender_icon.png 27 September, 2024 | 6:52 AM

జల్సాలకు అలవాటుపడి చోరీలు

26-09-2024 12:37:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు స్నేహితులు(మైనర్లు) చోరీల బాట పట్టారు. లంగర్‌హౌజ్, నార్సింగి ప్రాంతాల్లో రాత్రుళ్లు ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేస్తూ వాటిని తక్కువ ధరకు విక్రయించేవారు.

సౌత్‌ఈస్ట్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం లంగర్‌హౌజ్ పోలీసులతో కలిసి ఈ ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకొని, వారి నుంచి  4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి జువైనల్‌హోంకు తరలించినట్లు సౌత్‌ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.