calender_icon.png 16 October, 2024 | 10:45 PM

ఆంధ్ర కాలనీలో దొంగల హల్ చల్

16-10-2024 08:19:13 PM

లక్షేట్టిపేట్,విజయక్రాంతి: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో గల ప్రైవేటు ఉపాధ్యాయుడు ప్రసన్న కుమార్ ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. వివరాల్లోకి వెళితే... దసరా పండుగ నిమిత్తం వారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కరీంనగర్ వెళ్ళాడు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఇంట్లోనే వస్తువులన్నీ చిందర వందరగా పడవేశారు. అంతే కాకుండా బీరువా పదునైన కొడవలి, కత్తెర ఉపయోగించి పగలగొట్టి బీరువాలోని వస్తువులన్నింటినీ బయట హాల్లో తీసుకువచ్చి బంగారం లేదనుకొని వదిలిపెట్టారు. కానీ వారు వదిలిపెట్టిన దాంట్లో అర తులం బంగారంతో తయారుచేసిన చైన్ లాకెట్ తోపాటు మరో లాకెట్ ను రోల్డ్ గోల్డ్ గా భావించి వదిలేశారు.

బీరువాలోని చీరలు అన్నింటిని దులపడంతో ఆయన భార్య దాచిపెట్టుకున్న 7500 రూపాయలు నగదు తో పాటు మరో 400 రూపాయలు కూరగాయలు కొనుగోలు కోసం ఉంచిన 20, 10 రూపాయల నోట్లు దాదాపు ఒక డబ్బాలో గల 1500 రూపాయల నాణాలను దోచుకు వెళ్లారు. చిందర వందర చేసి బైకుల తాళాలను పడవేసి వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సతీష్ కు ఫోన్ చేయగా వారి సిబ్బందిని పంపించి ఫోటోలు తీసుకొని వెళ్లారు. కానీ ఇంకా ఏమి దర్యాప్తు మొదలు పెట్టినట్లు కనిపించడం లేదని బాధితుడు తెలిపాడు. దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిందిగా నగదును కూడా ఇప్పించాలని బాధితుడు వేడుకుంటున్నారు.