calender_icon.png 21 September, 2024 | 11:11 AM

జ్యూయెలరీ షాపులో దొంగలు పడ్డారు

26-07-2024 11:03:48 AM

బాలానగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి లో ఉన్న ఓ జువెలరీ షాప్ నందు అర్ధరాత్రి దొంగలు పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని శ్రీకృష్ణ జువెలరీ షాప్ నందు రెండు షట్టర్లను పగలగొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారు. ఈ చోరీ పై జ్యువెలరీ షాప్ యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున గౌడ్, ఎస్సై తిరుపాజి ఆధ్వర్యంలో క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి ఎంత మొత్తం బంగారం గురి అయింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.