హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చిత్రబృందం మంగళవారం సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో హీరో కార్తీ మాట్లాడుతూ.. “సత్యం సుందరం’ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా భావోద్వేగానికి గురయ్యాను.
ముందుగా కే విశ్వనాథ్, బాలచందర్, కమల్హాసన్, దాసరి గారు లాంటి గొప్పవారికి థాంక్స్ చెప్పాలి. వాళ్లు ఇలాంటి సినిమా మనకు చిన్నప్పుడే చూపించారు. ఇలాంటి ప్రేమానురాగాలు జీవితంలో దూరమవుతున్నాయని, మళ్లీ ఆ భావోద్వేగాలను తీసుకొచ్చారని ప్రేక్షకులు చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు.