calender_icon.png 24 October, 2024 | 2:47 AM

మా మధ్య వాటికి చోటు లేదు

21-07-2024 12:10:53 AM

ప్రేమ కథా చిత్రాల్లో జంటగా కనిపించి అటుపై నిజ జీవితంలో ఒక్కటైన వారు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ కూడా ఈ కోవలోని వారే. ‘తుజే మేరీ కసమ్’ (2003) చిత్రం ద్వారా సినీ పరిశ్రమలకు పరిచయమైన వీరిద్దరూ ఈ సినిమాతోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మార గా, 2012లో వివాహ బంధంతో దంపతులుగా మారారు జెనీలియా - రితేష్. అనుబంధాల లోగిలో అలకలు, అరిమరికలు లేకుండా ఉండవు కదా ఎంతోమంది భార్యభర్తలు అంటుంటారు. అయితే మా మధ్య అలాంటి వాటికి చోటు లేదు అని చెబుతున్నారీ జోడీ. దాదాపు ఇరవై రెండేళ్ళ వారిద్దరి పరిచయంలో ఎలాంటి వాదనలు జరగలేదట.

తాను కాస్త కలవరపాటుకు గురైనా.. అలాంటి సందర్భాల్లోనూ రితేష్ తనకు తగిన సహకారం అందిస్తారంటోంది జెనీలియా. ప్ళ్ళున కొంత కాలానికే ఎవరి దారి చూసుకుంటున్న ఈ కాలంలో వీరి దాంపత్యం ఇంత సానుకూలంగా సాగడానికి ఇద్దరి మధ్య అనురాగమే కారణం. వివాహమై దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రేమ ప్రయా ణం ఆరంభించిన వారిలా రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు. దంపతులుగా, తల్లిదండ్రులుగా సమతుల్య జీవనం సాగిస్తున్న ఈ జంట వృత్తిపరంగానూ పలు చిత్రాల్లో కలిసి నటించారు.

తెలుగు దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమాతో తెరమీదికి వచ్చిన జెనీలియా - రితేష్, నాగచైతన్య - సమంత జోడీగా తెరకెక్కిన ‘మజిలీ’ చిత్రానికి రీమేక్‌గా మరాఠీలో రూపొందిన ‘వేద్’ (2022)లో తెరమీద భార్యాభర్తలుగా కనపడ్డారు.