calender_icon.png 12 February, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తకూడదు

12-02-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): యాసంగి (రబీ) 2024 సంబంధించి ధాన్యం సేకరణ గురించిన సన్నాహక సమావేశం ఈరోజు రాయగిరిలోని లింగ బసవ  గార్డెన్ లో జరిగింది . ఈ సమావేశానికి  అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు.  గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏజెన్సీ అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని,  గ్రామస్థాయిలో క్రమ పద్ధతిన దశలవారీగా కోతలు జరిగే టందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాని కొరకు హార్వెస్టర్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయమని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రానున్న రబీ సీజన్లో గత సీజన్ కంటే రెట్టింపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నందున దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. 

కొనుగోలు కేంద్రాల్లో మరియు మిల్ పాయింట్లలో సరిపడు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో మంచినీటి వసతి మరియు టెంట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. అదేవిధంగా ఈ సీజన్లో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి కేంద్రం కు అనువైన ఎగువ ప్రాంతంలో ఉన్న స్థలాన్ని గుర్తించాలని సూచించారు. 

కొనుగోలు కేంద్రాలకు ఒక్కొక్కరికి 30 చొప్పున టార్పాలిన్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , జిల్లా సహకార అధికారి శ్రీధర్ , మరియు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, జిల్లా కోపరేటివ్ అధికారి రవీందర్, సహాయ పౌర సరఫరాల అధికారిని రోజా , జిల్లాలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు,  ఇతర అధికారులు హాజరయ్యారు.