14-12-2024 12:00:00 AM
విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్స్ వాడకంపై పరిమితి విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది గంటల తరబడి మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. వీటివల్ల విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వచ్చే సాధారణ పౌరులకు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది.ప్రజలకు అసౌకర్యంగానూ ఉంటున్నది. మొబైల్స్పై పూర్తి స్థాయిలో నిషేధం కాకున్నా పరిమితి సమయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
- రావుల రామ్మోహన్రెడ్డి