calender_icon.png 6 October, 2024 | 2:55 PM

మన విద్యావిధానంలో మార్పు రావాలి

05-10-2024 01:25:27 AM

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే విద్యా విధానంలో మార్పు రావాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్న సంఘ రాష్ట్ర, జిల్లా బాధ్యులతో పలు విద్యారంగ విషయాలపై చర్చించారు.

అనంతరం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జీ సదానందంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని కోరారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.