calender_icon.png 25 October, 2024 | 2:44 AM

ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ తీగ చోరీ

25-10-2024 12:51:29 AM

కామారెడ్డి,అక్టోబర్ 24 (విజయక్రాంతి): పంట పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ తీగను చోరీ చేసిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. చందూరు మండల కేం ద్రంతోపాటు పక్కనే ఉన్న ఘన్‌పూర్ గ్రామంలో వ్యవసాయ పంప్‌సెట్ల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న కాపర్ తీగను ఎత్తుకెళ్లారు. గమనించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకుమార్ తెలిపారు.