calender_icon.png 28 September, 2024 | 4:46 AM

ఎస్‌బీఐ బ్రాంచిలో దొంగతనం

28-09-2024 12:40:50 AM

ఖమ్మం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలోని ఎస్‌బిఐ బ్రాంచిలో గురువారం అర్ధరాత్రి దుండగులు చొరబడి, చోరీకి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. గురువారం రాత్రి బ్యాంక్ వెనుక వైపు ఉన్న డోర్ గ్రిల్స్‌ను తొలగించిన దుండగులు బ్యాంక్‌లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం సి బ్బంది బ్యాంక్‌ను తెరిచి చూడగా దొ ంగతనం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్య, ఏసీపీ రెహమాన్ బ్యా ంక్ వద్దకు పరిశీలించారు. మధిర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.