రూ.5 లక్షల వస్తువులు చోరీ
మంచిర్యాల, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని ఆర్కే 5 గనిలో శనివారం రాత్రి జరిగిన దొంగతనంలో సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయినట్టు సమాచారం. సుమారు 8 సెల్ఫోన్లు, రూ.10 వేల నగదు, ఇతర పని ముట్లు దొంగతనానికి గురైనట్లు తెలిసింది. కిటికీకి రంధ్రం చేసి, పెట్టెల లాక్ పగులగొట్టి సుమారు రూ.5 లక్షల విలువ గల వస్తువులు దొంగతనం జరిగినట్లు సమాచారం.
కార్మికుల వస్తువులకు భద్రత కరువు
సింగరేణి బొగ్గు గనులపై లాకర్లు అందుబాటులోకి రాకపోవడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్మికుల వస్తువులు భద్రపర్చుకునేందుకు ప్రతి గనిపై లాకర్లను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన యాజమాన్యం ఇప్పటి వరకు వాటివైపు దృష్టిసారించడం లేదు. ఇప్పటికీ చెక్క డబ్బాలే వినియోగిస్తున్నారు.