13-02-2025 11:01:07 AM
హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమాయత్ నగర్ మినర్వా హోటల్(Himayat Nagar Minerva Hotel) గల్లీలోని ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు అపహరణకు గురయ్యాయి. ఇంట్లో పనిచేస్తున్న బిహార్ వ్యక్తి చోరీ(Bihar man arrested) చేసినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అభయ్ కెడియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసిన నిందితుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సునీల్ ను నాగ్ పుర్ లో పోలీసులు పట్టుకున్నారు.