calender_icon.png 19 October, 2024 | 3:00 PM

చికిత్సపొందుతూ యువతి మృతి

19-10-2024 12:17:28 AM

  1. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని బంధువుల ఆరోపణ
  2. ఆసుపత్రి ఎదుట ఆందోళన

 కాప్రా, అక్టోబర్ 18: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యువతి చికిత్సపొందుతూ మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ సీఐ అంజయ్య కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నిఖిత(23) ఎంటెక్ చదువుతోంది.

గురువారం నిఖితకు ఛాతినొప్పి రావడంతో కుటుంబీకులు కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీకర ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స చేసిన అనంతరం వైద్యులు నిఖిత మృతిచెందిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు.

ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చిన నిఖిత.. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపించారు. నిఖిత మృతికి కారణమైన వైద్యులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత  నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆసుపత్రి యజమాన్యం, మృతురాలి బంధువులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.