calender_icon.png 9 October, 2024 | 2:27 PM

ప్రియుని వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

09-10-2024 12:15:10 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన జక్కం అంజలి (18) అనే యువతి ప్రియుని కట్నం వేధింపులు భరించలేక ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడిందని ఎస్సై చుంచు రమేష్ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జక్కం అంజలి చిన్న గుడిపేట గ్రామానికి చెందిన యాటకారుల రాజు (24) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. మూడు నెలలుగా రాజు రూ 5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని అంజలికి ఫోన్ చేస్తూ వేధించాడు. అంజలిపై అనుమానం పెంచుకొని ఇంటికి వచ్చి పలుసార్లు కొట్టాడు. రాజు నిత్యం వేధిస్తున్న తీరుకు మనస్థాపం చెందిన అంజలి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి జక్కం విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.