calender_icon.png 25 September, 2024 | 3:52 AM

ఆర్‌ఎంపీ వైద్యం వికఠించి యువకుడి మృతి

25-09-2024 01:43:25 AM

కుటుంబ సభ్యుల రాస్తారోకో 

లక్షెట్టిపేట, సెప్టెంబర్ 24: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి యువకుడు మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తకొమ్ముగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన బత్తుల మధూకర్(25) ఈ నెల 18న నీరసంగా ఉన్నదని ఆర్‌ఎంపీ బొడ్డు శ్రీనివాస్‌ను సంప్రదించాడు.

శ్రీనివాస్ మధూకర్ ఇంటికి వెళ్లి పరీక్షించి స్లున్ ఎక్కించాడు. స్లున్‌లో ఇంజక్షన్ ఇచ్చి పెట్టగా చలితో కూడిన వణుకు రావడంతో మధూకర్‌ను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎంఆర్‌ఐ స్కాన్ చేయించగా బ్రేయిన్ ఇన్‌ఫెక్షన్ అయిందని, ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడిందని అక్కడి వైద్యులు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయి మధూకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మంగళవారం ఆర్‌ఎంపీని కఠినంగా శిక్షించాల ని కుటుంబ స భ్యులు, బంధువులు లక్షెట్టి పేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

పోలీసులు బాధితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, తప్పకుండా శిక్ష పడుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.