calender_icon.png 9 October, 2024 | 10:52 AM

దసరా నాటికి పనులు పూర్తి కావాలి

09-10-2024 12:11:35 AM

కలెక్టర్ బదావత్ సంతోష్

సీఎం స్వగ్రామంలో పర్యటన

కల్వకుర్తి, అక్టోబర్ 8: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండారెడ్డి గ్రామంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

దసరా రోజున ముఖ్యమంత్రి స్వగ్రామానికి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, పార్కిగ్ అంశాలపై చర్చించారు. ఆయనవెంట ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.