08-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే హరీశ్ బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (విజ యక్రాంతి): ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అందజేస్తున్న పెళ్లి కానుకను లబ్ధిదారులు విని యోగించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. సోమవారం కౌటాల, సిర్పూర్ మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. పథకాల అమలులో పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్లు పుష్పలత శ్రీనివాస్, నాయకులు విజయ్, శ్యామల, గురుదాస్, కవిరాజ్, మధు, అశోక్, నాగేందర్, జగదీష్ తదితరు లు పాల్గొన్నారు.