ఒకరి మృతి, మరొకరికి గాయాలు
రాజేంద్రనగర్, అక్టోబర్16: గుర్తుతెలియని వాహనం.. స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. కార్వాన్ ప్రాంతానికి చెందిన మహేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ అతడి మిత్రుడు నిఖిల్తో కలసి సన్ సిటీలో ఉండే తమ మరో స్నేహితుడి వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీపై మంగళవారం రాత్రి బయలుదేరారు.
బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు స్కూటీపై ఇంటికి తిరిగివస్తుండగా టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం వీరి స్కూటీని అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. నిఖిల్కు తీవ్ర గాయాలవడం తో చికిత్స నిమిత్తం నానల్నగర్లోని ఓలివ్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి.. వాహనాన్ని నిలపకుండా పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.