ఆగి ఉన్న బైకులపైకి దూసుకెళ్లిన వాహనం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 11: డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాటేదాన్ గణేశ్ నగర్లో ఓ ట్రాన్స్పోర్ట్ వాహనం వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.