ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
వనపర్తి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి మినీ బస్సును ఢీ కొనడంతో ఒకరు మృతి చెందా రు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున కొత్తకోట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన 12 మం ది కర్నూల్లో ఓ శుభకార్యానికి వంటలు చేసేందుకు శనివారం రాత్రి మినీబస్సులో బయలు దేరారు. కొత్తకోట సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడమ టైరు పగిలిపోయింది.
అందులో ఉన్న కొంతమంది కిందకు దిగి టైర్ను మార్చుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్కు వేగంగా వెళ్తున్న వ్యాన్ మినీబస్సును ఢీ కొట్టింది. దీంతో హైదరాబాద్లోని చంద్రయాన్ గుట్ట హఫీజ్ బాబా నగర్ కాలనీకి చెందిన సయ్యద్ ముస్తాఫా (33) మృతి చెందాడు. మహమ్మద్ అజీమ్, రవి నాయక్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముస్తాఫాకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.