పలువురికి గాయాలు
జనగామ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రయాణికులతో వెళ్తు న్న ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడటంతో పలువురికి స్వల్ప గాయాల య్యాయి. కర్ణాటకలోని బెం గుళూరు నుంచి ఆదివారం 35 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్ బస్సు వరంగల్కు వస్తున్నది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయ ంలో జనగామ జిల్లాలోని 163 రహదారిపై యశ్వంతపూర్ గ్రామాల మధ్య కు బస్సు చేరుకోగానే వెనుక టైర్ ప ంక్చర్ అయింది. బస్సు వేగంగా ఉ ండటంతో ఒక్కసారిగా డివైడర్కు ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో బస్సు ముందు భాగం స్వల్పం గా ధ్వంసం కాగా.. పలువురు ప్ర యాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.