- 126 మంది మృతి.. తీవ్ర ఆస్తి నష్టం
- వియత్నాంలోనూ భారీవర్షాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: పిలిప్పీన్స్, వియత్నాం దేశాలను అత్యంత తీవ్రమైన ట్రామి తుఫాను కుదిపేసింది. పిలిప్పీన్స్లో ట్రామి విధ్వంసానికి 126 మంది మరణించారు. భారీ ఆస్తినష్టం కూడా చోటుచేసుకొ న్నది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో పెకిలించబడ్డాయి.
భారీ వరదలకు ఊర్లకు ఊర్లే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ జల ప్రళయం పిలిప్పీన్స్ నుంచి ఆదివారం వియత్నాంలోకి ప్రవేశించింది. క్వాంగ్ బిన్హ్, క్వాంగ్ నామ్ ప్రావిన్స్లలో ఆదివారం ఒక్కరోజే 60 సెం.మీ వర్షం కురిసిందని, సోమవారం ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలను అధికారులు హెచ్చరించారు.