calender_icon.png 28 October, 2024 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిలిప్పీన్స్‌ను కుదిపేసిన ట్రామి

28-10-2024 12:00:00 AM

  1. 126 మంది మృతి.. తీవ్ర ఆస్తి నష్టం
  2. వియత్నాంలోనూ భారీవర్షాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: పిలిప్పీన్స్, వియత్నాం దేశాలను అత్యంత తీవ్రమైన ట్రామి తుఫాను కుదిపేసింది. పిలిప్పీన్స్‌లో ట్రామి విధ్వంసానికి 126 మంది మరణించారు. భారీ ఆస్తినష్టం కూడా చోటుచేసుకొ న్నది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో పెకిలించబడ్డాయి.

భారీ వరదలకు ఊర్లకు ఊర్లే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ జల ప్రళయం పిలిప్పీన్స్ నుంచి ఆదివారం వియత్నాంలోకి ప్రవేశించింది. క్వాంగ్ బిన్హ్, క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లలో ఆదివారం ఒక్కరోజే 60 సెం.మీ వర్షం కురిసిందని, సోమవారం ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలను అధికారులు హెచ్చరించారు.