calender_icon.png 19 October, 2024 | 2:49 AM

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

19-10-2024 12:00:00 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 18: ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన షేక్ మౌలానా (57), బీపాషా దంపతులు జీవనోపాధి నిమిత్తం తుర్కయంజాల్ మున్సి పాలిటీలోని తొర్రూర్‌లో నివాసం ఉంటు న్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మౌలానా రెండేళ్లుగా వనస్థలిపురంలోని ఒక కాంట్రాక్టర్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శుక్రవారం హస్తినాపురంలోని మ్యాక్స్ షోరూం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ సెల్లార్‌లో మట్టిని లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. మౌలానాపై ట్రాక్టర్ పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.