ఒకరు మృతి
అల్లాదుర్గం(మెదక్), అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. సీతానగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగయ్య పెద్దశంకరంపేట సంతకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రాంపూర్ గ్రామ శివారుకు రాగానే ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య గాయాలతో బయటపడగా ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నోళ్ల వెంకయ్య (64) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుడు బేతయ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.