హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి (ఎంపీడీవో) అధికారుల టీజీవో ఫోరం రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. టీజీవో ఫోరం రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. టీఎంపీడీవో సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన టీ శ్రీనివాసరావు, జే పద్మావతిలతోపాటు ఎన్నికైన కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.