హైదరాబాద్: సీజన్ మారినా కానీ తెలుగు టైటాన్స్ ఆట మారలేదు. అభిమానుల ఆశలు తీరడం లేదు. మొదటి మ్యాచ్ గెలవడంతో అబ్బా.. అంటూ సంబరపడిపోయిన అభిమానులను రెండు, మూడు మ్యాచుల్లో ఓడిపోయి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది. మంగళవారం జైపూర్ జరిగిన మ్యాచ్లో 22-52 తేడాతో ఓటమి చవి చూసి ఇంత ఘోరమైన ఆట మాకు తప్పా మరెవరికీ సాధ్యం కాదని నిరూపించింది.
జైపూర్ కెప్టెన్ అర్జున్ 19 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మరో మ్యాచ్లో యూపీ యోధాస్ జట్టు 57-36 తేడాతో బెంగళూరు బుల్స్ మీద ఘన విజయం సాధించింది.
బెంగళూరు కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 16 పాయింట్లు సాధించినా కానీ జట్టుకు విజయం దక్కలేదు. బెంగళూరు జట్టు ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. 30 పాయింట్ల తేడాతో గెలిచిన జైపూర్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది.