calender_icon.png 2 October, 2024 | 5:59 AM

గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం

02-10-2024 02:47:22 AM

మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అహింస, శాంతియుత పోరాటంతో దేశ స్వాతంత్రానికి బాటలువేసిన జాతిపిత మహాత్మాగాంధీ దారిలోనే తాను తెలంగాణ సాధన కోసం పోరాటం కొనసాగించానని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని.. స్వతంత్రం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాన్ని స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి వెనుక గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు.