calender_icon.png 17 October, 2024 | 7:57 AM

విద్యార్థిని చితక బాదిన టీచర్

17-10-2024 02:13:06 AM

పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కొత్తగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో గణేష్ టెంపుల్ ఏరియాకి చెందిన చేతన్ 6వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో సతీష్ అనే ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇచ్చాడు. మంగళవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల హోంవర్క్‌ను పరిశీలించాడు. చేతన్ హోం వర్క్ అసంపూర్తిగా ఉండటంతో  కోపంతో చితకబాదాడు. తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3వ పట్టణ పోలీసులు సతీష్‌ను అరెస్టు చేశారు.