07-04-2025 12:00:00 AM
ఘనంగా సీఐటీయూ వ్యవస్థాపకుడు బీటీ రణదీవే వర్ధంతి సభ
మందమర్రి, ఏప్రిల్ 6: సీఐటీయూ వ్యవస్థాపకులు బిటి రణదీవే స్ఫూర్తిగా సింగరేణి లో ఐక్య పోరాటాలు ఉదృతం చేసి కార్మిక హక్కుల సాధన కోసం వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజీలేని ఉద్యమా లు నిర్మిస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, ఆల్లి రాజేందర్ స్పష్టం చేశారు.
రామకృష్ణాపూర్లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం బిటి రణదీవే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలను ఏకతాటి పైకి తీసుకువచ్చి ఐక్య పోరాటాలకు నెలవుగా ఉండాలనే ఉద్దేశంతో సీఐటీయూ ను స్థాపించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. బిటి రణదీవే స్ఫూర్తితో మే 20న జరిగే జాతీయ సమ్మెను అన్ని కార్మిక సం ఘాలతో కలిసి ఐక్యంగా విజయవంతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, సిహెచ్పీ పిట్ సెక్రటరీ అయిందాల శ్రీనివాస్, కేకే -5 సెక్రటరీ సంకె వెంకటేష్ , వర్క్ షాప్ పిట్ సెక్రటరీ భరత్, సివిల్ ఫిట్ సెక్రటరీ అంగడి రాజ్ కుమార్, కాసిపేట 2 పిట్ సెక్రటరీ బుద్దే సురేష్, శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ పిట్ సెక్రటరీ పసు పునూటి శ్రీకాంత్, కెకె డిస్పెన్సరీ పిట్ సెక్రటరీ పంగ మల్లేష్, శ్రీకాంత్, కాసిపేట్ 1 అసి స్టెంట్ ఫిట్ సెక్రటరీ నాగవెల్లి శ్రీధర్, సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ లతో పాటు ఆర్గనైజర్లు ఆదర్శ్, ధరిశెట్టి సురేష్, లింగాల రమెష్, కలవల శ్రీనివాస్, రాజ్ కుమార్, మనోజ్, అరుణ్, రాంబాబు, తాజుద్దీన్, అల్వాల అభిలాష్ పాల్గొన్నారు.